సర్వ శిక్ష అభియాన్ లో విధులు నిర్వహిస్తున్న ఎంఐఎస్
కో-ఆర్డినేటర్ల యొక్క ఆవశ్యకత:
1. ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ల నియామకం :
విద్యాహక్కు చట్టం తేది : 01-04-2010 నుండి అమలులోకి వచ్చినప్పటి నుంచి మండల స్థాయిలో విద్యా
వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడానికి ప్రతి మండలానికి ఒక ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ ను
లెటర్ నెం. 5730/ఆర్.వి.ఎం.(ఎస్ఎస్ఏ)/బి10/2010, తేది : 07-08-2012 ఉత్తర్వుల
ప్రకారం నియమించడం జరిగింది.
2. నియామకపు విధానం:
ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ల నియామకాలు రాష్ట్ర పథక సంచాలకులు, సర్వ శిక్షా అభియాన్, ఆంధ్రప్రదేశ్ సర్క్యూలర్ నెం. 5730/ఆర్.వి.ఎం(ఎస్.ఎస్.ఏ)/బి10/2010, తేది: 22-08-2012 ఉత్తర్వుల
ప్రకారం నియామకపు విధి విధానాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ & ఛైర్మన్, సర్వ శిక్షా అభియాన్, నియామకపు బోర్డు ఛైర్మన్ గాను, జిల్లా
విద్యాశాఖాధికారి, డైట్ ప్రిన్సిపల్, ఒక సబ్జెక్టు ఎక్స్ పర్ట్ మెంబర్లుగాను మరియు ప్రాజెక్టు
ఆఫీసర్, సర్వశిక్షా అభియాన్ మెంబర్ కన్వీనర్ గాను ఆయా జిల్లాల
స్థాయిలో జిల్లా ఎంపిక కమిటగా ఏర్పాటు చేయబడి జిల్లాల వారీగా మండల స్థాయిలో
రోస్టర్ పాయింట్ల ఆధారంగా 50 % వ్రాత
పరీక్ష మరియు నైపుణ్య పరీక్ష మరియు 50% అకాడమిక్ మార్కుల ఆధారంగా
ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ల ఎంపిక జరిగింది.
3. మండల విద్యావనరుల కేంద్రాల్లో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు
నిర్వహిస్తున్న కీలకమైన బాధ్యతలు :
- ఆయా మండల పరిధిలో ఉన్న ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ ఆ మండలం యొక్క పూర్తి స్థాయి పాఠశాలల వివరములు, దత్తాంశ సేకరించడం, ప్రతి ఏడాది విడుదలవుతున్న నిధుల యొక్క వివరములు, వాటి యొక్క గణాంక పుస్తకములు నిర్వహించుటలో ఉపాధ్యాయులకు సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
- మండల స్థాయిలో సర్వ శిక్షా అభియాన్ యొక్క ఇంటర్ వెన్షన్స్ అమలు చేయుటలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- విద్యాశాఖ కు మండల స్థాయిలో (క్షేత్ర స్థాయిలో) పరిపాలనాపరమైన సిబ్బంది లేనందున విద్యాశాఖ యొక్క విధులు కూడా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులైన ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ లే విద్యాశాఖ విధులు కూడా నిర్వర్తించడం జరుగుతుంది.
- జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి సమయములోనైన వారు కోరిన రిపోర్టులను సమర్పించడం మరియు ఎలక్ర్టానిక్ మెయిల్ ద్వారా మండలాల సమాచారాన్ని పంపించడం జరుగుతోంది.
- ప్రతి సంవత్సరం సెప్టెంబరు 30 నాటికి పాఠశాలల యొక్క సమాచారం కొరకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ & అడ్మినిస్ర్టేషన్, న్యూ ఢిల్లీ మరియు మినిస్ర్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్, న్యూ ఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న యూనిఫైడ్- డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యు-డైస్) డేటా ఎంట్రీ మరియు వాలిడేషన్ లో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ల పాత్ర గత నాలుగు సంవత్సరాల నుంచి కీలకంగా పోషిస్తున్నది.
- యు-డైస్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ర్టాల విద్యాశాఖ కు మరియు సర్వ శిక్షా అభియాన్ కు వార్షిక ప్రణాళిక (యానువల్ వర్క్ ప్లాన్ & బడ్జెట్ ) ను జిల్లా వారీగా కేటాయించడం జరుగుతుంది. ఈ విషయంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు మండల స్థాయిలో డేటా కాప్చర్ ఫార్మాట్ ను కంప్యూటరైజ్ చేయుటలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
- పాఠశాలలో ఉన్నటువంటి కంప్యూటర్లను (CAL School & ICT School)) సందర్శించి వాటిని పనిచేసే విధంగా చేయడం.
చైల్డ్ ఇన్ఫో (విద్యార్థుల సమాచారం) :-
- రాష్ట్ర పథక సంచాలకులు, సర్వ శిక్షా అభియాన్ ఆంధ్రప్రదేశ్ ఆర్. సి. నెం. 484/ఆర్.వి.ఎం(ఎస్ఎస్ఏ)/సి2/2012 తేది : 12-04-2013 ప్రకారం రాష్ర్ట వ్యాప్తంగా ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క పూర్తి స్థాయి వివరములు చైల్డ్ ఇన్ఫో అనే వెబ్ సైట్ యందు పొందపర్చివలసి యున్నది. ఈ వెబ్ సైట్ ను మండల స్థాయి లో నిర్వర్తించవలసిన పూర్తి బాధ్యత ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లదే అని పైన పేర్కొన్న ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.
- 2013-14 విద్యా సంవత్సరంలో ప్రతి జిల్లాలోనూ ఆయా మండలాల్లో పని చేస్తున్న ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు ఆయా మండల పరిధిని బట్టి దాదాపుగా 6000 నుంచి 25000 వరకు విద్యార్థులను ఈ వెబ్ సైట్ లో రాష్ర్ట వ్యాప్తంగా నమోదు చేయడం జరిగింది.
- 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఈ వెబ్ సైట్ ను చైల్డ్ ఇన్ఫో ట్రాకింగ్ సిస్టమ్ గా ఆయా మండల స్థాయిలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు నిర్వర్తించాల్సిన బాధ్యత వారిపై ఉంది. Childinfo ను నిర్వర్తించడంలో ఆయా మండల స్థాయిలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- ఈ వెబ్ సైట్ నందు పిల్లల వారిగా ఆధర్ ను అనుసందానం చేయడం లో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లదే కీలకమైన పాత్ర మరియు ప్రతి సంవత్సరం పిల్లల వారిగా గ్రేడింగ్ మరియు మార్కుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం పాఠశాలల్లో విద్యార్థులు అడ్మిషన్స్ జరిగిన తర్వాత జరిగే నిరంతర ప్రక్రియ.
పాఠశాల యాజమాన్య కమిటీల ఆర్థిక గణాంక నిర్వహణ:-
- సర్క్యూలర్ ఆర్.సి. నెం. 766/ఆర్.వి.ఎం/ఎ4/2013 రాష్ట్ర పథక సంచాలకులు, సర్వ శిక్షా అభియాన్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్., ఉత్తర్వుల ప్రకారం ఆయా మండల పరిధిలో ఉన్న పాఠశాలల యాజమాన్య కమిటీల ఆర్థిక గణాంక నిర్వహణ నిమిత్తం అకౌంట్స్ పుస్తకాల నవినీకరణ, అప్ డేషన్ ను ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లకు అప్పగించడం జరిగింది. దీని నిమిత్తం ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు మండల పరిధిలోని ప్రతి పాఠశాలకు వెళ్ళి ప్రధానోపాధ్యాయులకు అకౌంట్స్ పుస్తకాలు నిర్వహించడం లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ పై అవగాహన కల్పించి, ఆయా పుస్తకాలు నవీకరించాల్సిన బాధ్యత ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లపై ఉంది.గతంలో ప్రధానోపాధ్యాయులు అకౌంట్స్ బుక్స్ ను సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉపయోగించడం జరిగింది. ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు డబుల్ ఎంట్రీ సిస్టమ్ పై అవగాహన కల్పించి, ఆయా ప్రధానోపాధ్యాయులకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో సర్వ శిక్షా అభియాన్ అధికారులు సూచించిన ఫార్మాట్స్ లో వారికి పాఠశాలల గణాంక పుస్తకాలు నిర్వహించడం జరుగుతుంది. పై విధంగానే మండల విద్యా వనరుల కేంద్రం యొక్క గణాంక పుస్తకాలను కూడా ఎంఐఎస్ కో- ఆర్డినేటర్లు నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లకు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు మరియు అధికారాలు సర్క్యూలర్ ఆర్.సి. నెం. 766/ఆర్.వి.ఎం (ఎస్ఎస్ఏ)/ఎ4/ 2013 రాష్ట్ర పథక సంచాలకులు, సర్వశిక్షా అభియాన్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్., ఉత్తర్వుల ద్వారా స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
- ఆర్.సి. నెం. 367/ఆర్.వి.ఎం(ఎస్ఎస్ఏ)/సి1/11 తేది: 27.08.2012 రాష్ట్ర పథక సంచాలకులు, సర్వ శిక్షా అభియాన్, హైదరాబాద్., ఉత్తర్వుల ప్రకారం మండల విద్యావనరుల కేంద్రంలో గతంలో పని చేసిన మండల రిసోర్స్ పర్సన్స్ (MRPs) ను తిరిగి ఉపాధ్యాయుల వృత్తికి పంపివేయడం జరిగింది. వీరిని పంపించిన తర్వాత మండల విద్యావనరుల కేంద్రంలో వీరు నిర్వర్తించాల్సిన విధి విధానాలు, ఉద్యోగ బాధ్యతలు అన్నియూ కూడా మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లే నిర్వర్తిస్తున్నారు.
కాబట్టి, మా యొక్క ఆవశ్యకతను గుర్తించి, ప్రభుత్వ
సేవలలో ప్రభుత్వం నిరంతరం పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎంఐఎస్
కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించాల్సివస్తోంది. మేము నిర్వర్తించాల్సిన ఉద్యోగ
విధి నిర్వహణలో భాగంగా పలు సమస్యలను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. దానికి ప్రధాన
కారణం మేమంతా ఒప్పంద ఉద్యోగులం అవ్వటం వల్లనే. పైన తెలిపిన ఉద్యోగ నిర్వహణా బాధ్యతలు ప్రతి ఏటా నిరంతరం
జరిగే కార్యక్రమాలు.
మనకు మన ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చీయాలి.సమాన పని కి సమాన వేతనం ఇవ్వాలి.ఎటువంటి పరిమితులు లేని హెల్త్ కార్డులు ఇవ్వాలి.PF సౌకర్యం కల్పించాలి. ఉద్యోగి మరణిస్తే 15 లక్షల ఎక్స్గ్ గ్రేషియా చెల్లించి అర్హతతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.ఐ డిమాండ్స్ మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ReplyDelete